అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొద్దు శీను హత్య కేసులో ఓం ప్రకాశ్ కి జీవిత ఖైదు విధించిన కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Moddu Seenu
అనంతపురం: పరిటాల రవి హత్య కేసులో నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దుశీను హత్యకేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్ కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో కోర్టు మొత్తం 23 మంది సాక్షులను విచారించింది. విచారణ అనంతరం బుధవారం తీర్పు ఇచ్చింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత ఓం ప్రకాశ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ కలిసి తనకు శిక్ష పడేలా చేశారని, తర్వాత మద్దెల చెర్వు సూరిని కూడా హతమారుస్తానని నినాదాలు చేసి సంచలనం సృష్టించాడు. అందరు కలిసి తనను ఈ కేసులో ఇరికించారని అతను అన్నాడు.

మొద్దుశీనును ఓం ప్రకాశ్ 2008 నవంబర్ 9వ తేదీన కారాగారంలోనే చంపాడు. తాను రామకోటి రాసుకుంటూ ఉండగా మొద్దుశీను తనను డిస్టర్బ్ చేశాడని దాంతో కోపమొచ్చి తాను అతన్ని డంబుల్ తీసుకొని చంపినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవిని మద్దెల చెర్వు సూరి కళ్లలో సంతోషాన్ని చూడడానికే తాను చంపానని మొద్దుశీను ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో కారాగార శిక్ష అనుభవస్తున్న మొద్దు శీనును ఓం ప్రకాశ్ రెండేళ్ల క్రితం చంపాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X