వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికి తెలంగాణ ఎంపిల కుట్ర?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambhasiva Rao
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి రోశయ్యను దింపేసి ఆ స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర్ రావును కూర్చోబెట్టాలని తమ పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర నేతలు విందు ఇవ్వడంపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేసిన విమర్శను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల విమర్శపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

సొంత పార్టీకి చెందిన నేతలు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణాకు అడ్డొస్తే చేతులు నరికేస్తాం, రక్తపాతం సృష్టిస్తాం, కృత్రిమ భూకంపం సృష్టిస్తాం అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు. వారు తలలు, చేతులు నరుకుంటే సీమాంధ్రులేమైనా చేతులకు గాజులు తొడుక్కొని కూర్చొన్నారా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికైనా స్పందించి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X