హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు దక్కాల్సిన సిఎం పదవిని రోశయ్య కొట్టేశారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ముఖ్యమంత్రిని చెయ్యాలని అందరూ సంతకం చేస్తే ఆ పీఠాన్ని అధిష్టానం కారణంగా కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదన్నారు. అప్పుడు చంద్రబాబునాయుడికి మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్నదనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని సూచించారు. రోశయ్యకు రాజకీయంగా చాలా అనుభవం ఉందని, ఆ విషయాన్ని ఆయన అంటున్నారని, అయితే ఆయన తన 59 ఏళ్ల అనుభవాన్ని ప్రతిపక్షాలపై బురద చల్లడానికే వినియోగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆ అనుభవాన్ని ప్రజా సమస్యలు తీర్చడంలో దృష్టి పెడితే బాగుంటుందన్నారు.

తమ పార్టీ నేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రోశయ్యపై మరో తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. రోశయ్య రాజకీయ చరిత్ర గురించి చెప్పాల్సి వస్తే చాలా ఉందని ఆయన అన్నారు. రోశయ్య రాజకీయ వ్యభిచారి అని ఆయన వ్యాఖ్యానించారు. రోశయ్య తన 59 ఏళ్ల రాజకీయ చరిత్రలో చాలా ఘనకార్యాలు చేశారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరితే రోశయ్య దానికి సమాధానం చెప్పకుండా దాటేశారని, పైగా చంద్రబాబును నిందించారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X