వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ పై నాదెండ్ల కుట్రలో చంద్రబాబు పాలు పంచుకున్నారు: లక్ష్మిపార్వతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: ఎన్టీఆర్ ను గద్దె దించడానికి నాదెండ్ల భాస్కర రావు చేసిన కుట్రలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా పాలు పంచుకున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. రేణుకా చౌదరి పార్టీ నుంచి వెళ్లిపోవడానికి చంద్రబాబే కారణమని ఆమె ఆరోపించారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చేసిన కుట్రలో సహకరించినవారందరికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదవులు కట్టబెట్టారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఏ విధంగా కుట్ర చేసింది ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. కుట్రలో సహకరించిన అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ కు ఉప రాష్ట్రపతి పదవి ఇప్పించుకున్నారని, కృష్ణకాంత్ గవర్నర్ పదవికే కళంకం తెచ్చారని ఆమె అన్నారు. వైస్రాయ్ హోటల్ ప్రభాకర రెడ్డికి, సినీ నటి జయప్రదకు రాజ్యసభ పదవులు ఇచ్చారని ఆమె చెప్పారు. అప్పటి చీఫ్ జస్టిస్ మిశ్రా కూడా చంద్రబాబుకు సహకరించారని ఆమె అన్నారు. మిశ్రాపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జయప్రద ఏ విధంగా సహకరించారని అడిగితే ఆమె చాలా రకాలుగా సహకరించారని లక్ష్మీపార్వతి జవాబిచ్చారు.

బాలకృష్ణను తన వారసుడిగా ఎన్టీఆర్ ప్రకటిస్తే చంద్రబాబు ఖండించారని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుమారులు చాలా మంచివాళ్లు, అమాయకులు అని ఆమె అన్నారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ తనయులే తిరగబడాలని ఆమె అన్నారు. 1995 నుంచి పార్టీలో చంద్రబాబు కుట్ర చేస్తూ వచ్చారని, పార్టీలో సమర్థులైవారందరినీ కుట్రలు చేసి పంపించేశారని, తనకు అనుకూలమైనవారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు కట్టబెట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు ఆస్తులు ఎంతో తేల్చాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు గానీ తనకు గానీ అస్తులు లేవని, చంద్రబాబు అవినీతి ద్వారా సంపద కూడబెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X