హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీని కొన్ని శక్తులు ప్రభావితం చేసే అవకాశాలు: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీని కొన్ని శక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అనుమానం వ్యక్తం చేశారు. కమిటీలో ఉన్న దుగ్గల్ సీమాంధ్ర నాయకుడైన సుబ్బిరామిరెడ్డి విందుకు వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. జస్టిస్ శ్రీకృష్ణ వెంటనే దుగ్గల్ చర్యలపై తెలంగాణ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక నాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కలిసి పని చేస్తానని చెప్పడాన్ని కోదండరామ్ స్వాగతించారు. కేసిఆర్, గద్దర్ ఇద్దరూ తెలంగాణ కోసమే పని చేస్తున్నారని, కలిసి పనిచేస్తే మంచిదేనన్నారు. తెలంగాణ సాధన కోసం కేవలం గద్దర్, కేసిఆర్ కాదని తెలంగాణవాదులు అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.

సుబ్బిరామిరెడ్డి విందుకు వెళ్లిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్ ను వెంటనే కమిటీనుండి తొలగించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగరరావు డిమాండ్ చేశారు. తెలంగాణపై వేసిన శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందన్న నమ్మకం ప్రజలకు పోయిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X