హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు పేరుతో సమస్యలు గాలికి: కోటగిరి విద్యాధరరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidhyadar Rao
హైదరాబాద్: రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఏం చేస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విధ్యాధరరావు ప్రశ్నించారు. చిరంజీవి ఎంపీలను దద్దమ్మలు అనడం సరియైనదేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులందరూ రాష్ట్రాన్ని గాలికొదిలేస్తున్నారని విమర్శించారు. ఓ పార్లమెంటు సభ్యుడు ఓదార్పు పేరుతో తిరుగుతున్నాడని, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మరికొందరు ఎంపీలు వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.

చిరంజీవికి రాజకీయ శిక్షణ అవసరం అన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పైనా ఆయన ధ్వజమెత్తారు. చిరంజీవిని విమర్శించే స్థాయి పొన్నంకు లేదన్నారు. చిరంజీవి గురించి మాట్లాడే ముందు పొన్నం ప్రభాకర్ ముందుగా తాను తెలంగాణకు ఏం సాధించాడో ఆలోచించుకోవాలన్నారు. కొందరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రాంతీయ విభేదాల పేరుతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అందుకు కొందరు కాంగ్రెస్ ఎంపీలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X