చంద్రబాబుపై, తెలుగుదేశం నేతలపై విరుచుకుపడిన మంత్రులు

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా సమర్థంగా పనిచేయడంలో విఫలమయ్యారని మాణిక్యవరప్రసాద్ అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబుకు తెలియడం లేదని, ఏం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో తెలియడం లేదని, ప్రజలు అసహ్యించుకునేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబులా వెన్నుపోటు పొడవడం కాంగ్రెసుకు తెలియదని ఆయన అన్నారు.
తెలుగుదేశం నాయకుల మాదిరిగా మాట్లాడితే తమ స్థాయి తగ్గినట్లు అవుతుందని మంత్రులు అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారని వారన్నారు. పదవి కోసం యనమల రామకృష్ణుడు లక్ష్మీపార్వతి కాళ్లు మొక్కారని వారన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను తప్పిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వారన్నారు. రోశయ్య సమర్థంగా పని చేస్తున్నారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications