వైయస్ పై సోనియా గాంధీకి వి. హనుమంతరావు ఫిర్యాదు

V Hanumantha Rao
న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆయన గురువారం సోనియాను కలుసుకుని తాజా రాజకీయాలపై చర్చించారు. నెల్లూరు జిల్లా ఓదార్పు ముగింపు సభలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన సోనియాకు వివరించారు. తనకు సహనం నశిస్తే ఉప్పెన వస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యను ఆయన సోనియా దృష్టికి తెచ్చారు.

కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన సోనియాను కోరారు. పోలవరం ప్రాజెక్టుపై బుధారం రాత్రి జెడి శీలం నివాసంలో జరిగిన ఆంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల సమావేశాన్ని విహెచ్ సోనియా దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా సోనియాను కలిశారు. నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సహకరించారని ఆమె సోనియాకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+