వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం మిర్యాలగుడా సభలో వైయస్సార్ ఫోటో కోసం పట్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగుడా సభలో శనివారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మిర్యాలగుడా సభలో ఆయనకు వైయస్సార్ అభిమానుల నుంచి నిరసన వ్యక్తమైంది. సభా వేదిక మీద వైయస్సార్ ఫోటో లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన ఫొటో తీసుకుని వచ్చి పెట్టారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రికి తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. పర్యటనను అడ్డుకోవడానికి పెద్దగా ప్రయత్నించలేదు గానీ నిరసన మాత్రం తెలిపారు.

నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను త్వరతిగతిన పూర్తి చేస్తామని రోశయ్య తన ప్రసంగంలో చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహారాలు నడపవద్దని ఆయన సూచించారు. ఎస్ ఎల్బీసికి వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన శనివారం నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్, మిర్యాలగుడా, నక్రేకల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X