వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆఫర్ ను పార్టీయే చూసుకుంటుంది: ప్రధాని మన్మోహన్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చేసిన మద్దతు ప్రతిపాదనపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజుల సియోల్ పర్యటనను ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన ఆయన విమానంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్పెక్ట్రమ్ కుంభకోణానికి పాల్పడిన కేంద్ర మంత్రి ఏ.రాజాను తొలగిస్తే యూపీఏ సర్కారుకు తాను మద్దతు ఇస్తానని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చేసిన ప్రకటనపై ప్రధాని మీడియాతో ప్రస్తావిస్తూ జయలలిత ప్రతిపాదించిన మద్దతు ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ హైకమాండ్‌కే ఉందన్నారు.

జి2 స్పెక్ట్రమ్ వ్యవహారంలో 1.70 లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు కాగ్ తన నివేదికలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని రాజాను మంత్రిమండలి నుంచి తప్పిస్తారా అనే ప్రశ్నకు ప్రధాని సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని పైపెచ్చు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని మన్మోహన్ గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X