కాంగ్రెసును బలోపేతం చేయడానికి కెసిఆర్ డీల్ ఎంత: నామా నాగేశ్వర రావు
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగా జనార్దన్ రెడ్డి మరోసారి కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాటలు మార్చడంలో కెసిఆర్ దిట్ట అని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తే ఎందుకు తెచ్చుకోలేదని ఆయన అడిగారు. తెలంగాణకు వ్యతిరేకమని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్తే ప్రజలు ఏది చెప్తే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెరాస బలహీనపడినప్పుడు ప్రాణం పోసింది తమ పార్టీయేనని, తెలంగాణకు తమ పార్టీ మద్దతిచ్చిందని ఆయన అన్నారు. కెసిఆర్ మాటల వెనక ఫ్యామిలీ బెనిఫిట్ ఉందని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెసు, తెరాస కలిసి తమ రాజకీయ వ్యవహారాన్ని అమలు చేస్తున్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశానంతరం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజాను తప్పించాలని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను డిమాండ్ చేశారు. స్పెక్ట్రమ్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన అడిగారు.