విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపేంద్ర వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటివాడు: సిఎం రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
విజయవాడ: మాజీ కేంద్రమంత్రి ఉపేంద్ర దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ లాంటి వాడని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. మంగళవారం విజయవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రోశయ్య సత్యనారాయణపురంలో మాజీకేంద్ర మంత్రి ఉపేంద్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఉపేంద్ర నిబద్దత కలిగిన వ్యక్తి అన్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవకే అంకితమయిన మహానుభావుడన్నారు. ఆయన మన మధ్య లేకపోవటం తీరని లోటు అని అన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కొణకళ్ల నారాయణ, మాజీ మంత్రులు మండలి బుద్దప్రసాద్, దేవినేని నెహ్రూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X