కావూరి సాంబశివరావు విజ్ఞతకే వదిలేస్తున్నా: కె కేశవరావు

K Keshav Rao
న్యూఢిల్లీ: తనపై, గిరిజనులపై చేసిన వ్యాఖ్యలకు తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు విజ్ఞతకే వదిలేస్తున్నానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు అన్నారు. గిరిజనులపై కావూరి చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా కలత చెందానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమావేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఈ వివాదం తాను ఇక ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. గుండె మీద చేయి వేసుకుని కావూరి చెప్పాలని, అక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.

గిరిజనుల పట్ల తాను చాలా సెన్సిటివ్ అని, కావూరి చేసిన వ్యాఖ్యలకు బాధపడి ఉద్వేగంతో తాను బయటకు వచ్చానని, మీడియా ప్రతినిధులు కూడా చూశారని ఆయన అన్నారు. తనకు గిరిజనులతో ఉన్న సంబంధంపై ఆయన వివరించారు. తన సమీప బంధువు ఒకరు గిరిజన వ్యక్తి అని అంటూ ఆ బంధుత్వం గురించి కూడా ఆయన వివరించారు. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలని ఆయన అన్నారు. కావూరి సాంబశివ రావు ఏమన్నారో, ఏమంటారో ఆయన ఇష్టమని కేశవరావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+