జగన్ ఓదార్పులో సోనియా ఫోటో ఎందుకు పెట్టరు?: దామోదర్ రెడ్డి

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ త్యాగధనుల సభలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగేవారు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రలో తన తండ్రి వైయస్ ఫోటోతో పాటు ఆల్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించరా అని మాజీమంత్రి, శాసనసభ్యుడు దామోదరరెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. తెలంగాణ త్యాగధనులకు వైయస్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

తెలంగాణకు వ్యతిరేకి ఆయిన వైయస్ ఫోటోను తెలంగాణ కోసం అమరులైన వారి సంస్మరణ సభలో పెట్టమని డిమాండ్ చేయటం విడ్డూరమన్నారు. గిరిజనులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిడబ్లూసి సభ్యుడైన కె కేశవరావును విమర్శిస్తే సోనియాగాంధీని అవమానపరిచినట్టేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యింది సోనియాగాంధీ దయవల్లనే అని అన్నారు. సోనియాగాంధీ వైయస్ పై దయచూపించకుంటే వైయస్ అంతటి వాడయ్యేవాడా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+