Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్పీకర్ కు వివరణ ఇచ్చిన తెదేపా అసమ్మతి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్

Prasanna Kumar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన కొవ్వూరు ఆసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం శాసనసభ సభాపతి(అసెంబ్లీ స్పీకర్) కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. సభాపతిని కలిసిన ప్రసన్నకుమార్ రెడ్డి సభాపతి పంపిన నోటీసుకు వివరణ ఇచ్చుకున్నారు. సభాపతికి వివరణ ఇచ్చుకున్న అనంతరం ఆయనను మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి నిరాకరించారు.

ప్రసన్నకుమార్ గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని విమర్శిస్తున్నారు. చంద్రబాబులో మార్పు కోరుకుంటున్నానంటు ప్రకటనలు చేశాడు. క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. టిడిపి కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకోవటం లేదు. టిడిపి శాసనసభ్యుడుగా ఉంటూ టిడిపికి, బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయనపై టిడిపి సభాపతికి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కిరణ్ కుమార్ ప్రసన్నకుమార్ కు నోటిసులు పంపారు.

కాగా ప్రసన్నకుమార్ టిడిపికి దూరమవుతూనే క్రమంగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతున్నాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రలో జగన్ తో పాటు పాల్గొన్నాడు. తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించటం జగన్ మంచితనానికి నిదర్శమని, ఆయన బాటలో నడుస్తానని చెప్పాడు. జిల్లాలో జరిగిన ఓదార్పు ముగింపు యాత్రలో కూడా ఆయన లక్ష్మీపార్వతి, రోజా తదితరులతో కలిసి పాల్గొన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+