వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ను సిఎం చేయాలనేది అధిష్టానంపై ఆధారపడి ఉంది: టిజి

|
Google Oneindia TeluguNews

T G Venkatesh
బెంగళూర్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా, వద్దా అనేది పార్టీ అధిష్టానంపై ఆధారపడి ఉంటుందని కర్నూలు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. దట్స్ తెలుగు డాట్ కామ్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురువారం ఆ విధంగా అన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నాయకుల అభిప్రాయం మేరకే రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

గొడవల్లో రాజకీయ నాయకులు పాల్గొనడం లేదని, విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారని, దీంతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇవన్నీ చూసిన తర్వాతనే కమిటీ ఏర్పాటు జరిగిందని ఆయన అన్నారు. కొత్త తరం వస్తే తెలుగుదేశం పార్టీ విస్తరించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ఇదే విధంగా అమలు చేస్తూ పోతే నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X