రోశయ్యా! ఖాళీ ప్రాజెక్టుల్లో దూకి చద్దాం: కాంగ్రెసు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి
ప్రభుత్వం వెంటనే 14ఎఫ్ పేరాను తొలగింపుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులను వెంటనే సస్పెండు చేయాలని డిమాండు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు రెచ్చగొడుతున్నారన్నారు. 31న తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ అనుకూలంగా నివేదిక ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే కొందరు ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతన్నారన్నారు. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆగారు. మరో రెండునెలలు ఆగితే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నించారు. హుసేన్ సాగర్ నిరుద్యోగుల కోసం ఉందా అన్నారు. ఈ సున్నితమైన అంశం అధిష్టానం దృష్టికి తీసుకొని వెళతామన్నారు.
పోలీసులు వెంటనే విశ్వవిద్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని మరో నాయకుడు ఆమోస్ డిమాండ్ చేశారు. ఎలాంటి అరాచకాలు చేయమని హామీ ఇస్తేనే పోలీసులు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి హుసేన్ సాగర్లో దూకమనడం చాలా అభ్యంతరకరమన్నారు.