వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులది న్యాయమైన సందేహం, వాయిదా సంతోషం: కెకె

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ: ఎస్సై పరీక్షలపై తెలంగాణ విద్యార్థులు వ్యక్తం చేసిన సందేహం న్యాయమైందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. పరీక్షలు వాయిదా వేసినందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యంగా పోరాడి డిమాండ్ సాధించినందుకు ఆయన తెలంగాణ విద్యార్థులను అభినందించారు. హైదరాబాద్ ను మినహాయించి ఎస్సై నియామకాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, అయితే అది చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుందో కాదో అనే అనుమానం ఉందని, దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్లినా చిక్కులు ఎదురు కావచ్చునని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో పరీక్షలను వాయిదా వేయడమే మంచిదని తమ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులం భావించామని ఆయన చెప్పారు.

పరీక్షల వాయిదాకు తాను కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కోరామని, అదే సందేహాలను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేసే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే వరకు పరీక్షలు పెట్టవద్దని ఆయన అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X