హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న తెలంగాణవాదులు, లాఠీఛార్జి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: ఫ్రీజోన్ అంశం తేలేవరకు ఎస్ఐ రాత పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హోంమంత్రి సబితారెడ్డి కాన్వాయ్ ను రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో విద్యార్థులు అడ్డుకున్నారు. సుమారు నాలుగువేల మంది విద్యార్థులు, తెలంగాణవాదులు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద సబితారెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. తెలంగాణ మంత్రి అయి ఉండి తెలంగాణకు న్యాయం చేయలేని మంత్రి సబితారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. మంత్రి చేతకానితనానికి తెలంగాణ వారు బలి అవుతున్నారని ఆరోపించారు.

తెలంగాణకు చెందిన మంత్రి సబితారెడ్డి ఉండగానే ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మంత్రి సావధానంగా ఆయన మాటలు వినటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డిజిపి అరవిందరావు కావాలనే ఉద్యామాన్ని అణిచివేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. రోశయ్య వికక్షణా రహితంగా మాట్లాడుతున్నారన్నారు. హోంమంత్రిగా ఉన్న సబితారెడ్డి తెలంగాణ విద్యార్థులపైనే లాఠీఛార్జి జరుగుతున్నప్పటికీ స్పందించటం లేదన్నారు.

కాగా హోంమంత్రిని అడ్డుకున్న సంఘటన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు హోంమంత్రిని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు. వారని చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి పర్యటన ఉద్రిక్తంగా తయారయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X