మారని వైయస్ జగన్ వైఖరి: ముఖ్యమంత్రి రోశయ్యపై పోరే
సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు ఆందోళన చేస్తున్నాయని, ప్రభుత్వం నిద్రలో జోగుతోందని, వాయిదాలతో కాలయాపన చేస్తోందని, అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి రాజకుంటోందని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నాలుగు నెలలుగా ఉద్యమం చేస్తున్నారని, 104 సిబ్బంది ఈ నెల 10వ తేదీ నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారని, బీడీ కార్మికులు 18 రోజులుగా ఆందోళనలు సాగిస్తున్నారని చెబుతూ వారి డిమాండ్లను క్రోడీకరించింది. తాజా పరిస్థితిని వివరించింది. రైతులు ప్రభుత్వంపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విమర్శించింది. గిట్టుబాటు ధర లేదంటూ వేలాది మంది రైతులు మార్కెట్లను, గిడ్డంగులను ముట్టడిస్తున్నారని తెలిపింది. సమస్యలపై మీడియా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలే సమాధానంగా చెబుతున్నారని సాక్షి వ్యాఖ్యానించింది.
Comments
Story first published: Friday, November 19, 2010, 10:12 [IST]