తెరపైకి వైయస్ జగన్ విద్యార్థి సేన: సీమాంధ్ర ఆందోళనలో పాత్ర
తాజాగా ఎస్ఐ రాత పరీక్షల వాయిదా కారణంగా గుంటూరులో జగన్ విద్యార్థి సేన శనివారం గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం బందుకు పిలుపునిచ్చింది. ఎన్ హెచ్ 9 వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. దీంతో జగన్ సమైక్యాంద్రకే కట్టుబడి ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. హోంమంత్రి సబితారెడ్డి ఎస్ఐ పరీక్షలు వాయిదా వేయటంతో సీమాంధ్రలో అగ్గి రాజుకుంది. అన్ని పార్టీలు, సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. తెలంగాణలోని అన్ని పార్టీలు, సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎస్ఐ రాత పరీక్ష వాయిదా ఉద్యామానికి మద్దతు పలికాయి. కాని జగన్ వర్గం మాత్రం బయటికి రాలేదు. కాని అదే సీమాంధ్రలో వెంటనే జిల్లా బందుకు పిలుపునిచ్చింది.
Comments
Story first published: Friday, November 19, 2010, 17:20 [IST]