తెలంగాణ, పోలవరం వేరు వేరు సమస్యలు: ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar
రాజమండ్రి: తెలంగాణ ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తెలంగాణ సమస్య వేరు, పోలవరం సమస్య వేరని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదన్నారు. పోలవరం పూర్తయితే కేవలం ఆంధ్ర ప్రాంతానికే కాకుండా రాయలసీమ, తెలంగాణ జిల్లాలకు సైతం నీళ్లు అందుతాయన్నారు. పోలవరం ఆహార సమస్యతో కూడుకున్నదన్నారు. పోలవరానికి ప్రస్తుత డిజైన్ మార్పు చేయాల్సిన అవసరం లేదన్నారు.

అయితే టెండర్లు పిలిచి త్వరగా పూర్తి చేయటానికి ప్రభుత్వం పూనుకోవాలన్నారు. ఇక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షిలో వ్యతిరేకంగా వార్తలు రావటంపై ఆయన ఆచితూచి స్పందించారు. పత్రికా విలువలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఏ పార్టీ కూడా ఇవ్వని ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ పత్రికలకు ఇస్తుందన్నారు. అయితే పత్రికలు తమ ప్రచురిస్తున్నవి సరియైనవా కాదా చూసుకోవాలన్నారు. కార్యకర్తలు కూడా పత్రికా కార్యాలయాలపై దాడులు చేయకూడదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+