కిరణ్ కుమార్ కు మందకృష్ణ మాదిగ 24 గంటల డెడ్ లైన్

తమ జాతికి చెందిన దామోదరం రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని తమ జాతి ప్రజలు ఎంతో సంతోషించారని, కానీ ఆ ఆశను వమ్ము చేశారని ఆయన విమర్శించారు. మంత్రి జె. గీతారెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి రాకుండా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో కోస్తా మాల ఉప కులానికి చెందిన పనబాక లక్ష్మికి మంత్రి పదవి ఇచ్చారని, తెలంగాణకు చెందిన మాదిగ ఉప కులానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications