వైయస్ జగన్ పై సెటైర్లు విసిరిన పిసిసి చీఫ్ డి. శ్రీనివాస్

Srinivas
హైదరాబాద్: కొత్త పార్టీని 45 రోజుల్లో పెడతానని ప్రకటించిన వైయస్ జగన్ పై ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సెటైర్లు విసిరారు. వైయస్ జగన్ పార్టీ పెట్టుకోవచ్చునని, పార్టీ పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని అంటూనే చిరంజీవి, జయప్రకాష్ నారాయణ కూడా పార్టీలు పెట్టారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీని బలహీనపరచడానికే వైయస్ జగన్ పార్టీ పెడుతున్నారని అనుకోవడం లేదని, కాంగ్రెసును బలహీనపరుస్తానని వైయస్ జగన్ చెప్పలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీని వీడిపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఏ విధమైన సమస్యలూ లేవని ఆయన స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు, సమర్థుడు, పరిపాలనాదక్షుడని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గ కూర్పులో చిన్నపాటి లోపాలు ఉండవచ్చునని, అవి సర్దుకుంటాయని ఆయన చెప్పారు. పనిచేసేవారిపైనే విమర్శలు వస్తాయని, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం విషయంలో జరిగింది అదేనని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఆవేదన ఉండవచ్చునని, రాయపాటితో మాట్లాడి సర్దుబాటు చేస్తామని ఆయన చెప్పారు.

కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి అభ్యర్థుల విషయం ఇప్పుడే వద్దని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుదామని ఆయన అన్నారు. రేపు బుధవారం పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం ఉందని, దానికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని ఆయన చెప్పారు. మీరే రాస్తారు, మీరే అడుగుతారని అని ఆయన కిరణ్ కుమార్ తో సంబంధాలపై అడిగిన ప్రశ్నలకు డిఎస్ సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+