చాలా మంది వెళ్లిపోయారు: వైయస్ జగన్ పై సిఎం కిరణ్ కామెంట్

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోయారని, పార్టీకి ఏ విధమైన నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ వ్యవహారంపై వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ కొత్త పార్టీ పెడుతున్నట్లు చేసిన ప్రకటనపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ వచ్చి కలిసి వెళ్లిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దుగ్గల్ మర్యాదపూర్వకంగానే కలిశారని ఆయన చెప్పారు. అయితే, ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వికె దుగ్గల్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. సాధారణంగా మీడియా కనిపిస్తే మాట్లాడడం వికె దుగ్గల్ కు అలవాటు.

కాగా, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, సరైన సమయంలో సరైన నిర్ణయం మీడియాకు చెబుతానని ఆయన అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఖరారు చేసుకోవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన బిజీగా గడిపారు. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ తో, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ఆయన సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఆయన సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సలహా తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో ఆయన భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+