హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందకృష్ణ మాదిగ నిరాహార దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madhiga
హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ చేయాలన్న డిమాండ్‌తో నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ దీక్షను పోలీసులు భగ్నంచేశారు. సికింద్రాబాద్‌లోని పార్సీగుట్టలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆయనను అరెస్టుచేశారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు నివేదిక ఇచ్చినందున అరెస్టుచేశామని పోలీసులు తెలిపారు.

తనను ఆసుపత్రికి తరలించడం దారుణమని మందకృష్ణ విమర్శించారు. ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని స్పష్టంచేశారు. మందకృష్ణ అరెస్టు సందర్భంగా కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆసుపత్రికి తరలించేందుకు వీల్లేదంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా వెనుక తలుపుతీసి మందకృష్ణ ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఐదునిమిషాల్లో ఆయనను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X