అసెంబ్లీలో డిసెంబర్ 31వ తేదీ తర్వాతి భయాల ప్రకంపనలు

డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏదో ఉపద్రవం వస్తుందని సభ్యులు ఆందోళన చెందుతున్నారని, ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లు మాట్లాడుతున్నారని, అది సరి కాదని, ఏ విధమైన ఉపద్రవం రాదని, ఆందోళనలు ముందుకు రావచ్చు గానీ ఏ విధమైన ఆందోళనకర పరిస్థితులు ఉండవని బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దడానికే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని అనడం సరి కాదని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఉపద్రవం వస్తుంది కాబట్టి ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు వెనకాడుతోందనే అభిప్రాయం సరైంది కాదని ప్రతిపక్ష సభ్యులకు మాటలకు ప్రతిస్పందిస్తూ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తను దృష్టిలో ఉంచుకునే కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆమె చెప్పారు. మిగతా కేసులను కేసువారీగా పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications