విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పర్యటనలో పాల్గొన్న పేర్ని నాని, చర్చలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Perni Nani
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో బందరు నియోజకవర్గం కాంగ్రెసు శాసనసభ్యుడు పేర్ని నాని సోమవారం పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నాడు. జగన్ పర్యటనలో పాల్గొంటానని నాని ఆదివారం చెప్పారు. ఈరోజు పర్యటనలో పాల్గొని సాంఘీభావం తెలిపారు. జగన్ తో పాటు కొద్దిసేపు చర్చించారు.

పాతమాజేరు ప్రాంతంలో జగన్ రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. పంట పొలాలను పరిశీలించారు. జగన్ పాతమాజేరుకు బైక్ పై వెళ్లడం విశేషం. కాగా కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని, అయితే తాను తన అనుచరులు, అభిమానుల ఒత్తిడి మేరకే జగన్ తో పర్యటనలో పాల్గొంటున్నాని చెప్పిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X