కాంగ్రెసు తెలంగాణ నేతలపై దుమ్మెత్తిపోసిన కె. చంద్రశేఖర రావు

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అని చెప్పుకుంటున్న కాంగ్రెసు నాయకులు విద్యార్థులపై కేసులు ఎత్తివేయించడంపై మాట్లాడడం లేదని, సిగ్గు ఉంటే కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన 24 గంటల లోపలే సీమాంధ్ర జీవులంతా ఒక్కటై 24 గంటలు కూడా మన సంతోషాన్ని ఉంచలేదని, తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు దద్దమ్మలని, అందుకే తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటై ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన అన్నారు. డిసెంబర్ 31వ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ ప్రజలు ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications