హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా జిల్లా సంక్షోభంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మంతనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: కృష్ణా జిల్లాలో ఏర్పడిన బందరు శాసనసభ్యుడు పేర్ని నాని సంక్షోభంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ జిల్లా నేతలతో సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో మాట్లాడారు. కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యులు జోగి రమేష్, మల్లాది విష్ణు, మంత్రి పార్థసారథిలతో కిరణ్ చర్చించారు. పంట నష్టపోయిన రైతులకు పరామర్ష పేరుతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోపాటు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలనుండి పలువురు ముఖ్యనేతలతో ముచ్చటిస్తున్నారు. వారిని తనవైపు లాక్కుంటున్నారు.

పేర్ని నాని పార్టీలోనే ఉంటానని చెప్పారని, కేవలం జగన్ తో పాటు కలిసి రైతులను మాత్రమే కలుస్తానని చెప్పినట్టు ముఖ్యమంత్రికి మంత్రి పార్థసారధి చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం రైతుల సమస్యలపై కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ యాత్రలో పాల్గొంటానని, తన కార్యకర్తలు, అభిమానులు జగన్ వెంట వెళ్లాలని సూచించినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత మంత్రి పార్థసారథి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జగన్ వెంట వెళ్లనప్పటికీ ఇప్పటికే అసంతృప్తులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్, మాజీ కౌన్సిలర్లు జగన్ వెంట వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X