స్పీకర్, బన్సల్ హామీతో లగడపాటి రాజగోపాల్ మౌనదీక్ష విరమణ

Lagaadapati Rajagopal
న్యూఢిల్లీ: రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మౌన దీక్షను కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విరమించుకున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ మీరాకుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సల్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. పవన్ కుమార్ బన్సల్ పార్లమెంటు భవన్ లో మౌన దీక్ష చేస్తున్న లడపాటి వద్దకు వచ్చారు. బన్సల్ తో కలిసి లడపాటి ఆయన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై లగడపాటి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు రైతాంగ సమస్యలు చర్చ రాకుండా చేశారని ఆయన అన్నారు.

అంతకు ముందు ఢిల్లీలోని పార్లమెంటు భవన్ లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సంచలనం సృష్టించారు. అకాల వర్షాలకు, అతి వృష్టికి, వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన సోమవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంటు భవన్ దీక్షకు దిగారు. రైతు సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, స్పీకర్ మీరా కుమార్ కు లేఖలు రాశారు. రైతు సమస్యలను పరిష్కరించే వరకు తాను దీక్ష విరమించేది లేదని మొండికేశారు. రైతు సమస్యలపై లోకసభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం మధ్యాహ్నం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ బయటకు రాలేదు. పార్లమెంటు భవన్ లోనే ఆయన మౌనదీక్ష చేస్తున్నారు. ఫోన్ చేసినా ఆయన మాట్లాడడం లేదు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. లగడపాటి రాజగోపాల్ తో దీక్ష విరమింపజేయడానికి ఎఐసిసి నాయకులు రాయబారాలు నడుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+