వైయస్ జగన్ వైపు చూస్తున్న మరో ఎమ్మెల్యే శేషా రెడ్డి

Sesha Reddy
రాజమండ్రి: ఇప్పటికే కృష్ణా, విశాఖలలో మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టుతో కాంగ్రెసు దాదాపు ఖాళీ అవుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో కూడా జగన్ ఎఫెక్టు పడుతోంది. కృష్ణాలో పేర్ని నాని, విశాఖలో సబ్బం హరి జగన్ వైపు వెళ్లడానికి దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో పలువురు జగన్ కు మద్దతు పలుకుతున్నారు. తాజాగా జిల్లాకు చెందిన శాసనసభ్యుడు శేషా రెడ్డి జగన్ వర్గం వైపు తొంగి చూస్తున్నారు.

ఈ నెల 15న జగన్ పర్యటన తూర్పు గోదావరిలో ఉన్నది. జగన్ పర్యటనలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనలో పాల్గొనాలా లేదా అని తన అనుచరులతో చర్చించిన తర్వాత తెలియజేస్తానని ఆయన అంటున్నారు. అనపర్తిలో తన అనుచరులతో ఆయన భేటీ కూడా అయ్యారు. అయితే జగన్ పర్యటనలో అభిమానులను అడిగి నిర్ణయం చెబుతానని చెప్పినప్పటికీ ఆయన పర్యటనలో పాల్గొనేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+