భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టిన టెక్కీ

తన భార్యను అక్టోబర్ 17వ తేదీన హత్య చేసినట్లు రాజేష్ విచారణలో అంగీకరించాడు. భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగిందని, ఈ సమయంలో రాజేష్ అనుపమ తలను గోడకేసి కొట్టాడని, దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయిందని, తీవ్రమైన కసితో అతను ఆమె గొంతు కోశాడని, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని, వాటిని డీప్ ఫ్రిజ్ లో పెట్టాడని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ జిఎస్ మార్టోలియా చెప్పారు. అమ్మ ఢిల్లీకి వెళ్లిందని అతను తన కవల పిల్లలిద్దరికీ సర్దిచెబుతూ వచ్చాడు. భార్యతో సంబంధాలు మెరుగు పడ్డాయని అనుపమ సోదరుడు సుజన్ కు అతను చెబుతూ వచ్చాడు. అయితే, అనుమానంతో సుజన్ శనివారం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుపమ, రాజేష్ 18 నెలల క్రితం వచ్చి డెహ్రాడూన్ లో స్థిరపడ్డారు.












Click it and Unblock the Notifications