విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఎఫెక్ట్: కృష్ణా జిల్లా కాంగ్రెసు సీనియర్ల మంత్రాంగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Nehru
విజయవాడ‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రభావం తీవ్రంగా పడడంతో కృష్ణా జిల్లా కాంగ్రెసు సీనియర్ నాయకుల్లో కదలిక వచ్చింది. వైయస్ జగన్ ప్రభావం తగ్గించే విషయంపై చర్చించడానికి పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు వారు రంగంలోకి దిగినట్లు కూడా చెబుతున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు జగ్గయ్యపేట కు చెందిన ఉదయభాను పాల్గొన్నారు. మధ్యాహ్నం విందు సమావేశంలో వైయస్ జగన్ ప్రభావంపై వారు విస్తృతంగా చర్చించారు.

వైయస్ జగన్ వైపు కృష్ణా జిల్లాలోని కాంగ్రెసు ద్వితీయ శ్రేణి నాయకులు, యువకులు వెళ్లడానికి ఉద్యుక్తులవుతున్నారు. దీన్ని కట్టడి చేయడానికి అనుసరించాల్సిన విధానాలపై వారు చర్చించారు. రైతు సమస్యలపై ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో వైయస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో తమ పార్టీకి చెందినవారు దానికి దూరంగా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు చర్చించారు. అయితే, వైయస్ జగన్ గురించి గానీ వైయస్ జగన్ వైపు వెళ్లే నాయకుల గురించి తాము చర్చించడం లేదని దేవినేని నెహ్రూ చెప్పినప్పటికీ చర్చ అంతా వైయస్ జగన్ ప్రభావంపైనే పడినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X