హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు, వైయస్ రాజశేఖరరెడ్డి కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని చూస్తున్నారని విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు సుమన్ మంగళవారం అన్నారు. సుమన్ ను మంగళవారం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. సుమన్ తో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థులను కోర్టులో హాజరుపరిచారు. వారు కోర్టు ఆవరణలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులపై పెట్టినవన్నీ అక్రమ కేసులన్నారు. ప్రభుత్వం అరెస్టులు చేసినా ఉద్యామాన్ని కొనసాగిస్తామన్నారు.

మాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమన్నారు. లాఠీఛార్జీలకు, తుపాకి గుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రభుత్వం కేసులు ఎత్తివేస్తామంటూనే నాపై16 కేసులు పెట్టిందన్నారు. తెలంగాణ కోసం జైళ్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వైయస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నాలు చేశారని, వారిద్దరి దుర్మార్గం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X