మేం రోడ్డెక్కే పరిస్థితి తేవద్దు: రైతు సమస్యలపై అసెంబ్లీలో చిరంజీవి

రాష్ట్రంలోని వర్షం తాకిడి ప్రాంతాల రైతులకు రాష్ట్రం 53 వేల కోట్ల రూపాయలు అడిగితే కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగామని ఆయన అన్నారు. రైతులకు హెక్టారుకు పది వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. మండలానికి ఒక్కటో రెండో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి, ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేయాలని, రైతులకు రూ. 200 చొప్పున బోనస్ ప్రకటించాలని ఆయన కోరారు. రైతులకు రాజకీయాలకు అతీతంగా భరోసా ఇద్దామని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసి ఉంటే రైతు మరణాలను ఆపి ఉండగలిగేవాళ్లమని, కనీసం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రైతు సమస్యలపై చర్చ చేపట్టిన గత 48 గంటల్లో జరిగిన ఎనిమిది మరణాలను ఆపి ఉండగలిగేవాళ్లమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications