చంద్రబాబు ఊరు నారావారిపల్లెలో తేల్చుకుందాం: రఘువీరా

రైతులను తాము అన్ని విధాలా ఆదుకుంటామని రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. వర్షాల వల్ల 20 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆయన చెప్పారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే కొనసాగుతుందని ఆయన చెప్పారు. మంగళగిరిలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఏర్పాటుకు కేంద్రం 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిందని ఆయన చెప్పారు. వరద బాధిత రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఆయన తెలిపారు. వరద తాకిడి ప్రాంతాల్లో నష్టం అంచనాకు రేపు, ఎల్లుండి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications