మహాగర్జనతో వరంగల్ గులాబీ మయం, వేడెక్కిన తెలంగాణ

Telangana Maha Garjana
వరంగల్: వరంగల్ నగరం పూర్తిగా గులాబీ మయం అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వరంగల్ లో తలపెట్టిన తెలంగాణ మహాగర్జన సభకు గురువారం వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వరంగల్లు రోడ్లన్నీ క్రిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణానికి ఐదు కిలోమీటర్ల మేర ప్రజలు నిండిపోయారు. వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేదు. కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రజల గుండెలను తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలోని బలీయతకు అద్దం పడుతున్నారు.

వరంగల్ సభా ప్రాంగణానికి కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. ముంబై, సూరత్, ఔరంగాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఈ సభకు తరలివచ్చారు. శ్రీకాంతాచారి ప్రాంగణం జనసముద్రమైంది. ఖమ్మం రోడ్డులో పోలీసులు వాహనాలను నిలిపేశారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ తరఫున తెలంగాణ ఎన్నారైలు కూడా సభకు వచ్చారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి ప్రజలు వరంగల్ కు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+