జగన్ ను మేం పంపించలేదు, ఆయనే రాజీనామా చేశారు: మొయిలీ

Veerappa Moily
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీనుండి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డియే బయటకు వెళ్లారని, ఆయనను పార్టీ బయటకు పంపించలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆదివారం ప్లీనరీలో తన నివేదికను ఏఐసిసికి అందించారు. మొయిలీ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిపై, వైఎస్ జగన్ వ్యవహార శైలిపై నివేదిక రూపొందించారు. జగన్ పై అధిష్టానంగానీ, పార్టీగానీ ఎప్పుడూ కొరడా ఝులిపించలేదన్నారు. తనంత తానే బయటకు వెళ్లి పార్టీ పెడతానని ప్రకటించాడన్నారు.

జగన్ మొదటిసారి ఓదార్పు చేపట్టినప్పుడే ఓదార్పు వద్దని అధిష్టానం హెచ్చరించినప్పటికీ ఆయన వినిపించుకోలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యపై, ఆయన ప్రభుత్వంపై, పార్టీపై విమర్శనలు చేసినప్పటికీ హెచ్చరికలతోనే విడిచిపెట్టామన్నారు. ఆలాంటి విమర్శలు చేయకుడదని సూచించినప్పటికీ ఆయన విమర్శలు కొనసాగించారని చెప్పారు. జూలై 19వ తేదిన రోశయ్యపై విమర్శలు వద్దన్నప్పటికీ ఆయన పెడ చెవిన పెట్టారన్నారు.

పార్టీపైన ఆయన ఆరోపణలు ఎక్కువవడం, జగన్ కు చెందిన సాక్షిలో వ్యతిరేక వార్తలు రావటంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పామని అయితే ఆయనను మాత్రం బయటకు పంపించలేదన్నారు. జగన్ మొదటినుండి అధిష్టానంపై వ్యతిరేకతనే ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+