చలో సెక్రటరియేట్ ఆందోళనలో అరెస్టయిన ఎమ్మెల్యేలు విడుదల

కాగా ప్రభుత్వం ప్రకటించిన సాయం రైతులకు ఏమాత్రం సమ్మతంగా లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. నిత్యం పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యలను ఆపని సాయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని నాగం చెప్పారు. రైతులకు న్యాయం జరగడానికి అవసరమైతే జైళ్లకు వెళ్లడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి అయిన పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications