ఐసియులోకి తరలించి చంద్రబాబుకు బలవంతంగా చికిత్స చేస్తున్న వైద్యులు

గురువారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం- ప్రభుత్వ ఏకపక్ష వైఖరి కారణంగా అపరిష్కృతంగా ముగిసింది. రైతులకు ఇదే మెరుగైన ప్యాకేజీ అని, ఇంకేమీ ఇవ్వబోమని కిరణ్కుమార్ ఖరాకండిగా చెప్పడంతో సమావేశం నుంచి టిడిపి, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు వాకౌట్ చేశారు. 'అఖిలపక్షం నిర్వహించమన్నారు, నిర్వహిస్తున్నాం...చెప్పండి' అంటూ కిరణ్ సమావేశ ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ విపక్షాలు బయటికి వెళ్లిపోయాయి. మిగిలిన పార్టీలతో సమావేశాన్ని కొనసాగించినా ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఏదీ ఇవ్వలేదు. కేంద్రంపై ఒత్తిడికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే విపక్షాల ప్రతిపాదనను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications