తెలుగుదేశం అధినేత చంద్రబాబును టార్గెట్ చేసిన వైయస్ జగన్

చంద్రబాబు దీక్షను తప్పు పడుతూ గురువారం వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ తరుచుగా వార్తాకథనాన్ని ప్రసారం చేస్తూ పోయింది. చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ప్రతిపక్ష నాయకులు సాక్షి వార్తాకథనాన్ని నమ్మారో లేదో తెలియదు గానీ చంద్రబాబుకు పరామర్శల వెల్లువ పెరిగింది. ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో సహా తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వరకు ఆయనను పరామర్శించారు. ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేశారు. అయితే, వైయస్ జగన్ అంతటితో ఆగలేదు. తాజాగా శుక్రవారం వెలువడిన సాక్షి దినపత్రికలో చంద్రబాబు దీక్ష స్కేచ్ ప్రకారమే జరిగిందంటూ దుమ్మెత్తిపోస్తూ ఓ వార్తాకథనాన్ని ప్రచురించారు. కడప జిల్లాలో తనకు అతి ముఖ్యమైన ప్రత్యర్థి అయిన మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది. పథకం ప్రకారమే వైయస్ జగన్ దీక్ష ముగిసిన తర్వాత చంద్రబాబును ఐసియుకి తరలించారని, అది కూడా దొంగ దీక్ష బయట పడిన తర్వాతనే ఆ పనిచేశారని సాక్షి వార్తాకథనం ఆరోపించింది.












Click it and Unblock the Notifications