హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక మెట్టు దిగిన కిరణ్ కుమార్ రెడ్డి: 135 కేసుల ఉపసంహరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలంటూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంతం పార్లమెంటు సభ్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ మెట్టు దిగివచ్చారు. విద్యార్థులపై మరో 135 కేసులు ఎత్తేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపీలు నిరాహార దీక్షకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత మంత్రులు, డిజిపిలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.

మంత్రులు జానారెడ్డి, దామోదరం రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సారయ్య తదితర తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులతో మంత్రులు జానారెడ్డి, సారయ్య దౌత్యం నెరిపారు. ఇంతకు ముందు ప్రభుత్వం 565 కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. మిగతా కేసులను దశలవారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X