వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళనకు సిద్ధమవుతున్న సీమాంధ్ర: రేపు జెఎసిల సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణలో ఉద్యమాలకు ప్రయత్నాలు సాగుతుండగా, సీమాంధ్ర కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించడానికి గడువు సమీపిస్తుండడంతో సమైక్యాంధ్ర కోసం ఉద్యమించడానికి సీమాంధ్ర విద్యార్థులు సన్నాహాలు ప్రారంభించారు. సీమాంధ్రలోని 14 విశ్వవిద్యాలయాల జెఎసిలు రేపు మంగళవారం నాగార్జున విశ్వవిద్యాలయంలో సమావేశమవుతున్నాయి.

నాగార్జున వర్సిటీలో మంగళవారం 14 విశ్వవిద్యాలయాల ఐకాసలు సమావేశం కానున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం జెఎసి నేతలు ప్రకటించారు. ఈ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత పరిస్థితులను సమీక్షిస్తామని చెప్పారు. సమైక్యాంధ్రపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులెవరూ మాట్లాడడం లేదని, దీనిని సహించేది లేదని తెలిపారు. తెలంగాణ నేతలు ఎడతెగకుండా మాట్లాడుతుంటే సీమాంధ్ర నాయకులు మాత్రం మౌనం పాటిస్తున్నారని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X