నేడు సాయంత్రమే నివేదిక!: త్వరగా పూర్తి చేయాలని కేంద్రం యోచన

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొగ మరిన్ని రాష్ట్రాలకు అంటకముందే దీనిపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గూర్ఖాలాండ్ రాష్ట్రం గురించి పశ్చిమ బంగాల్లో గొడవ జరుగుతోంది. చిన్న రాష్ట్రాల వివాదం మరిన్ని రాష్ట్రాలకు తాకకుండా ఉండేందుకు త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఇచ్చిన రోజునే ప్రధాని కార్యాలయానికి పంపే అవకాశం ఉంది
ప్రధానమంత్రి కార్యాలయం కూడా తమ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి మంత్రులకు కమిటీకి అప్పగిస్తుంది. ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి మంత్రుల కమిటీకి సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి కమిటీ తన నివేదికను ఇచ్చిన వారం రోజులలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశలో ఆలోచిస్తుంది. జనవరి 3, 4 తేదీల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications