వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి హత్య ఎప్పటికీ మిస్టరీయే, కేసు మూసేసిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Aarushi
న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి జంట హత్యల కేసు ఇక ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ చేతులెత్తేసింది. ఘటనాస్థలానికి సంబంధించి తగిన ఆధారాలు లేకపోవడంతో కేసు మూసేస్తున్నట్లు ప్రత్యేక కోర్టుకి బుధవారం తమ నివేదిక అందించింది. నిందితుల్ని పట్టుకోవడానికి ఫోరెన్సిక్‌ ఆధారాలు స్పష్టంగా లేకపోవడంతో ఒక ఆమోదయోగ్యమైన నిర్ధరణకు రాలేకపోయామని పేర్కొంది. నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న ఆరుషి హత్యకు గురైంది. అనంతరం నిందితుడిగా అనుమానించిన హేమ్‌రాజ్‌ కూడా అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే.

"న్యాయం కోసం ఎన్నో విధాలా ప్రయత్నించాం. సీబీఐ కేసు మూసివేయడం మమ్మల్ని విస్మయానికి గురి చేసింది" అని ఆరుషి తల్లిదండ్రులు నుపుర్‌, రాజేశ్‌ పేర్కొన్నారు. పైకోర్టుకి వెళ్లే అవకాశముందని వారి తరఫు న్యాయవాది రెబెకా జాన్‌ తెలిపారు. సీబీఐ నివేదికను కోర్టు ఆమోదిస్తే కేసులో నిందితులుగా భావిస్తున్న రాజ్‌కుమార్‌, విజయ్‌ మండల్‌, కృష్ణలకు విముక్తి లభించినట్లే. వీరు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X