జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడిస్తాం: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ:తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను 6వ తేదిన బహిర్గత పరుస్తామని కేంద్ర హోంశాఖామాత్యులు చిదంబరం గురువారం ప్రకటించారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ నివేదిక సమర్పించిన ఆనంతరం ఆయన హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత నివేదికను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శాంతిభద్రతల దృష్ట్యా బలగాలు మోహరించామన్నారు. రాష్ట్ర శాంతి భద్రతలకై అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ప్రజలు, పార్టీలు సంయమనం పాటించాలన్నారు.

కమిటీకి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, గ్రూపులు, పార్టీలు కమిటీకి సహకరించాయని తెలిపారు. నివేదికను హోం మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయని, దానికి కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సంప్రదింపులు జరుగుతాయని, సంప్రదింపుల తర్వాత తీసుకునే నిర్ణయాలకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదే అతి ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. జనవరి 6వ తేదీ సాయంత్రం నివేదికను తాము ఇంటర్నెట్ లో ఉంచుతామని శ్రీకృష్ణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఊహాజనితాల కథనాలు రాయవద్దని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చిదంబరం మీడియాను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+