వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడిస్తాం: చిదంబరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ:తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను 6వ తేదిన బహిర్గత పరుస్తామని కేంద్ర హోంశాఖామాత్యులు చిదంబరం గురువారం ప్రకటించారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ నివేదిక సమర్పించిన ఆనంతరం ఆయన హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత నివేదికను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శాంతిభద్రతల దృష్ట్యా బలగాలు మోహరించామన్నారు. రాష్ట్ర శాంతి భద్రతలకై అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ప్రజలు, పార్టీలు సంయమనం పాటించాలన్నారు.

కమిటీకి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, గ్రూపులు, పార్టీలు కమిటీకి సహకరించాయని తెలిపారు. నివేదికను హోం మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చాయని, దానికి కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సంప్రదింపులు జరుగుతాయని, సంప్రదింపుల తర్వాత తీసుకునే నిర్ణయాలకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇదే అతి ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. జనవరి 6వ తేదీ సాయంత్రం నివేదికను తాము ఇంటర్నెట్ లో ఉంచుతామని శ్రీకృష్ణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఊహాజనితాల కథనాలు రాయవద్దని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని చిదంబరం మీడియాను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X