కెసిఆర్, విజయశాంతి సహా 12 మందికి సుప్రీంకోర్టు నోటీసులు
గత సెప్టెంబరు 13, 14, 15 తేదీలలో హైకోర్టులో తెలంగాణ వారికి సరియైన ప్రాతినిథ్యం కల్పించాలని చేసిన ధర్నాకు టీఆర్ఎస్, మధుయాష్కీలు వచ్చి సంఘీభావం తెలిపారు. హైకోర్టు ఆవరణలోకి వచ్చి ధర్నాను ఉద్దేశించి మాట్లాడం కోర్టు ధిక్కారణ కిందకు ఎందుకు రాదని వారిని సుప్రీంకోర్టు నోటీసులో ప్రశ్నించింది. హైకోర్టును బహిరంగ వేదికగా మార్చారని ఆరోపణలు వచ్చినట్టు అందులో పేర్కొన్నారు.
కోర్టు ఆవరణలో ధర్నాలో పాల్గొని కోర్టును బహిరంగ సభగా మార్చారని అడుసుమల్లి జయప్రకాశ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లాయర్లు చేసిన ధర్నాలో పాల్గొని రాజకీయ నాయకులు ప్రొసీడింగ్సును అడ్డుకుని తద్వారా కోర్టు గౌరవాన్ని తగ్గించారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. ఆయన పిటిషన్కు స్పందించిన సుప్రీంకోర్టు సోమవారం వారికి నోటీసులు పంపించింది. ఈ ఆరోపణలు రుజువైతే వారికి సుమారు రెండునెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశముంది.