వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌, విజయశాంతి సహా 12 మందికి సుప్రీంకోర్టు నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: గత సెప్టెంబరు నెలలో హైకోర్టులో ప్రొసీడింగ్సును అడ్డుకున్నారన్న ఆరోపణలకు రెండు వారాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, కె.తారకరామారావు, విజయశాంతి, కవిత, నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, లాయర్లు నర్సింహారెడ్డి, జ్యోతికిరణ్ తదితరులు 12 మందికి సోమవారం నోటీసులు జారీ చేసింది. వచ్చిన ఆరోపణలకు 2 వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పెర్కొన్నది.

గత సెప్టెంబరు 13, 14, 15 తేదీలలో హైకోర్టులో తెలంగాణ వారికి సరియైన ప్రాతినిథ్యం కల్పించాలని చేసిన ధర్నాకు టీఆర్ఎస్, మధుయాష్కీలు వచ్చి సంఘీభావం తెలిపారు. హైకోర్టు ఆవరణలోకి వచ్చి ధర్నాను ఉద్దేశించి మాట్లాడం కోర్టు ధిక్కారణ కిందకు ఎందుకు రాదని వారిని సుప్రీంకోర్టు నోటీసులో ప్రశ్నించింది. హైకోర్టును బహిరంగ వేదికగా మార్చారని ఆరోపణలు వచ్చినట్టు అందులో పేర్కొన్నారు.

కోర్టు ఆవరణలో ధర్నాలో పాల్గొని కోర్టును బహిరంగ సభగా మార్చారని అడుసుమల్లి జయప్రకాశ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లాయర్లు చేసిన ధర్నాలో పాల్గొని రాజకీయ నాయకులు ప్రొసీడింగ్సును అడ్డుకుని తద్వారా కోర్టు గౌరవాన్ని తగ్గించారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఆయన పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు సోమవారం వారికి నోటీసులు పంపించింది. ఈ ఆరోపణలు రుజువైతే వారికి సుమారు రెండునెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X