విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విశాఖపట్నం : రైతుల సమస్యలపై, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై విన్నవించడానికి కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నెల 11వ తేదీన తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆయన ప్రధానికి సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈ నెల 11న ఢిల్లీ వెళుతున్నందున విశాఖ ఓదార్పు యాత్రకు స్వల్ప విరామం ఏర్పడనుంది. కృష్ణాజలాల తీర్పుని వ్యతిరేకిస్తూ, రైతుల సమస్యల పరిష్కారం కోసం 11న ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష చేపడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రైతుల సమస్యలు వివరించేందుకు ఆరోజు సాయంత్రం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్'మెంట్ కూడా జగన్ కోరారు. నిరాహారదీక్ష చేపట్టేందుకు జగన్ రైలులో ఢిల్లీ వెళతారు. ఢిల్లీ నుంచి రాగానే ఓదార్పు యాత్ర యథావిథిగా కొనసాగుతుంది. ఈ నెల 9వ తేదీన వైయస్ జగన్ రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రైతు సమస్యలపై ఇంతకు ముందు కూడా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఆయనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అపాయింట్‌మెంట్ దొరికింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X