హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుధవారం ఢిల్లీకి రావాలని తెలంగాణ ఎంపీలకు అధిష్టానం ఆదేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో ఉండాలని కోరుతూ తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులందరికీ మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ పోన్ చేశారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులందరికీ డిఎస్ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నానికల్లా ఢిల్లీలో తప్పకుండా ఉండాల్సిందేనని డిఎస్ వారితో చెప్పారు. రేపు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ఎంపీలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. 6వ తారీఖున హోంమంత్రి చిదంబరం నివదిక అన్ని పార్టీలకు నివేదికను అందజేసి, సాయంత్రం అధికారిక వెబ్‌సైట్లో పెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు ఉద్వేగాలకు లోనయ్యి ఎలాంటి కామెంట్లు చేయకుండా అదుపులో పెట్టడానికే అధిష్టానం ఎంపీలను బుధవారం పిలిచినట్టుగా తెలుస్తోంది.

ఇంతకుముందే కె కేశవరావు తదితర ఎంపీలు పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఒప్పించి తీసుకు వస్తామని, తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, తెలంగాణ ఇవ్వకుంటే పార్టీ పదవులు వదులుకుంటామని వారు ప్రకటనలు గుప్పించిన నేపథ్యంలో కేంద్రం వారిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. వారిని పిలిచి అదుపులో ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రజల్లో ఉన్న తెలంగాణ సెంటిమెంటును ఈ భేటీలో అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఎంపీలు అంటున్నారు. గత 2009లో కేంద్రం ప్రకటించిన తెలంగాణకు కట్టుబడి ఉండాలని వారు అధిష్టానాన్ని కోరనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X